Anna Canteen: ఏపీ సెక్రటేరియట్ సమీపంలోని అన్న క్యాంటీన్ ను ధ్వంసం చేసిన దుండగులు!

  • వెలగపూడిలోని అన్న క్యాంటీన్ ధ్వంసం
  • గోడలు పగలగొట్టి, ఇటుకలను తొలగించిన వైనం
  • గతంలో ఈ క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు
Anna canteen near AP Secretariat destroyed

అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే మార్గంలో కుడివైపున ఈ క్యాంటీన్ ఉంది. టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ క్యాంటీన్ ను ప్రారంభించారు. 

ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. దీంతో సచివాలయం పక్కనున్న అన్న క్యాంటీన్ ప్రాంతం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఈ క్రమంలో ఈ క్యాంటీన్ ను ఎవరో ధ్వంసం చేశారు. క్యాంటీన్ పైకప్పు తొలగించి, గోడలు పగులగొట్టారు. ఇటుకలను తొలగించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

More Telugu News