Mahesh Babu: త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం?

  • మహేశ్ 28వ సినిమా త్రివిక్రమ్ తో  
  • జులై 2వ వారం నుంచి షూటింగ్ 
  • కథానాయికగా అలరించనున్న పూజ హెగ్డే
  • ప్రతి నాయకుడిగా ఖాయమైన తారకరత్న
  • వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు సమాచారం  
Trivikram and Mahesh Babu movie update

మహేశ్ బాబు తన 28వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హారిక - హాసిని బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. జులై 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగానే అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న 3వ సినిమా ఇది. అందువలన అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం. ఇప్పుడు ఇది అభిమానుల్లో మరింత ఆత్రుతను పెంచే అంశంగానే చెప్పాలి. గతాన్ని .. వర్తమానాన్ని కలిపి చూపిస్తూ ఈ కథ నడుస్తుంది.

రామ్- లక్ష్మణ్ ఈ సినిమాకి స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్నారు. వాళ్లు కంపోజ్ చేసిన ఒక భారీ యాక్షన్ సీన్ తోనే ఈ సినిమా షూటింగు మొదలవుతుందని అంటున్నారు. పూజ హెగ్డే కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా తారకరత్న కనిపించనున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News