ఇరాక్ను భయపెడుతున్న కాంగో ఫీవర్.. ముక్కు నుంచి రక్తం కారి మరణిస్తున్న బాధితులు!
- ఇరాక్లో 1979లో తొలిసారి వెలుగులోకి కాంగో ఫీవర్
- జంతువుల నుంచి మానవులకు సోకుతున్న వైనం
- పశువులపై క్రిమిసంహారకాలు పిచికారీ చేస్తున్న అధికారులు
నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ (CCHF) అనే రక్తం పీల్చే పేలు (Tick Bite) ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.