పొత్తుల విషయం ఎన్నికలప్పుడే మాట్లాడాల్సిన అంశం: నారా లోకేశ్
- టీడీపీ మహానాడు తొలిరోజున పలు నిర్ణయాలు
- కీలక ప్రతిపాదన చేసిన లోకేశ్
- వరుసగా రెండుసార్లు పదవులు చేపట్టినవారికి విరామం
- ఆ లెక్కన తాను మూడుసార్లు పనిచేశానని వెల్లడి
- ఈ నిర్ణయం తనతోనే అమలు అని ఉద్ఘాటన
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని యువతకు కేటాయిస్తామని ఉద్ఘాటించారు. పార్టీ కోసం పనిచేసిన చాలామంది యువకులు ఉన్నారని, వారిని పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు.
ఇక, ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పొత్తుల అంశంపైనా లోకేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. పొత్తుల విషయం ఎన్నికలప్పుడే మాట్లాడాల్సిన అంశమని తేల్చేశారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జగన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయడంపైనే ఉందని వివరించారు.