ఒంగోలులో టీడీపీ పొలిట్బ్యూరో భేటీ.. మహానాడు తీర్మానాలపై చర్చ
- రేపటి నుంచే టీడీపీ మహానాడు
- ఒంగోలు సమీపంలో రెండు రోజుల పాటు వేడుకలు
- రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరో ప్రత్యేక శ్రద్ధ
రేపటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహానాడులో మొత్తం 17 అంశాలపై టీడీపీ తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. ఇతర అంశాలపై అంతగా పట్టింపు లేకున్నా.. రాజకీయ అంశంపై ప్రవేశపెట్టే తీర్మానంపై పొలిట్ బ్యూరో ప్రధానంగా దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఓట్ల చీలిక లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే దిశగా పొలిట్ బ్యూరో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.