Narendra Modi: ప్ర‌ధానిగా మోదీ ఎన్నికై నేటికి 8 ఏళ్లు!... విషెస్ చెబుతూ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ట్వీట్‌!

kanna lakshminarayana tweet on modi completes 8 years as pm
షార్ట్స్‌లో చూడండి
భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి నేటికి స‌రిగ్గా 8 ఏళ్లు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ రికార్డు విక్ట‌రీ న‌మోదు చేయ‌గా... 2014 మే 26న భార‌త ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లోనూ బీజేపీ విజ‌యం సాధించ‌గా వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా మోదీనే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మొత్తంగా భార‌త ప్ర‌ధాన మంత్రి హోదాలో మోదీ 8 ఏళ్ల మైలురాయిని గురువారం చేరుకున్నారు. 

ఈ సంద‌ర్భాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా మోదీ ఎన్నికై నేటికి 8 సంవత్సరాలు అంటూ పేర్కొన్న క‌న్నా.. అధికారాన్ని అతిపవిత్రమైన బాధ్యతగా, సంక్షోభాలను సవాళ్ళను ఎదుర్కొంటూ, విజయాలెన్ని దక్కినా పొంగిపోని నిగర్విగా, భరతమాత సేవలో భారత్ ని విశ్వగురుగా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీకి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Prime Minister
BJP
Kanna Lakshminarayana

More Telugu News