జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పులివెందుల కేంద్రంగా అంబేద్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలి: జనసేన నేత మహేశ్
- అంబేద్కర్ ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ యత్నిస్తోంది
- కోనసీమ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది
- వైసీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు
ఈ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ పై గౌరవం ఉంటే కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కడపకు ఆ పేరు పెట్టలేకపోతే పులివెందుల కేంద్రంగా 27వ జిల్లాను ఏర్పాటు చేసి దానికి అంబేద్కర్ పేరును పెట్టాలని సూచించారు. తన సొంత నియోజకవర్గానికి అంబేద్కర్ పేరును జగన్ పెడితే ఆయన చిత్తశుద్ధి అందరికీ తెలుస్తుందని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను రాజకీయాల్లోకి లాగి ఆయన ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ యత్నిస్తోందని మహేశ్ దుయ్యబట్టారు. పచ్చటి కోనసీమలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని అన్నారు.