TRS: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

  • నామినేషన్ వేసిన దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
  • అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాల అందజేత
  • హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
TRS Rajya Sabha candidates files nomination

రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 


More Telugu News