Mahesh Babu: 12 రోజుల్లో 200 కోట్లకి పైగా వసూళ్లతో 'సర్కారువారి పాట'

  • ఈ నెల 12న విడుదలైన 'సర్కారువారి పాట'
  • యూఎస్ఏ లో 2.3 మిలియన్లకి పైగా రాబట్టిన సినిమా 
  • సినిమాకి అదనపు బలంగా నిలిచిన ఫైట్లు .. పాటలు 
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు కథానాయకుడిగా దర్శకుడు పరశురామ్ రూపొందించిన 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదలైంది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లోను రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 12 రోజుల్లో 200 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. యూఎస్ ఏలో 2.3 మిలియన్ ప్లస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇంకా తన దూకుడును చూపుతుండటం విశేషం. 

మహేశ్ లుక్ తో పాటు ఆయన యాక్టింగ్ ను కూడా పరశురామ్ కొత్తగా చూపించాడు. ఇక కీర్తి సురేశ్ ను కూడా కొత్త కోణంలో చూపించి షాక్ ఇచ్చాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు  .. తమన్ పాటలు ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి. తాను అనుకున్నట్టుగానే మహేశ్ బాబుకి హిట్ ఇచ్చినందుకు తాను చాలా హ్యాపీగా ఉన్నానని పరశురామ్ చెబుతున్నాడు..

More Telugu News