ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య సంచలన ఆరోపణలు.. వాయిస్ మెసేజ్ విడుదల
- పోస్టుమార్టానికి ఒప్పుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న అనిత
- మహిళా కానిస్టేబుళ్లతో తనను కొట్టిస్తున్నారని ఆరోపణ
- ఈ మేరకు బంధువులకు వాయిస్ మెసేజ్ పంపిన అనిత
ఈ క్రమంలో ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేదాకా మృతదేహానికి పోస్టుమార్టం చేయనీయబోమంటూ బాధిత కుటుంబం అడ్డుకుంటోంది.
ఈ క్రమంలో ఏపీ పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య అనిత సంచలన ఆరోపణలు చేశారు. సుబ్రహ్మణ్యం మృతదేహం పోస్టుమార్టానికి అనుమతి ఇస్తూ సంతకం పెట్టాలని తనపై పోలీసులు ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ క్రమంలోనే మహిళా పోలీసులతో తనను కొట్టిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు ఓ వాయిస్ మెసేజ్ను ఆమె తన కుటుంబ సభ్యులకు పంపింది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోవాలంటూ అనితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించిన సంగతి తెలిసిందే.