గాల్లో ఉండగానే పనిచేయడం మానేసిన ఇంజిన్.. ముంబైలో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్
- ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన విమానం
- విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి ఆగిపోయిన వైనం
- తిరిగి ముంబైకి తరలించి సేఫ్ ల్యాండింగ్
- మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరు తరలించిన ఎయిర్ ఇండియా
- విచారణ ప్రారంభించిన డీజీసీఏ
రెండు సీఎఫ్ఎం ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో ఒకటి గగనతలంలో ఉండగానే మొరాయించింది. ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ముంబై మళ్లించి 10.10 గంటలకు ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను మరో విమానంలో బెంగళూరుకు తరలించారు.