భారత్లో పెట్టుబడుల గమ్యస్థానం తెలంగాణ: లండన్ భేటీలో కేటీఆర్
- లండన్ టూర్లో బిజీబిజీగా కేటీఆర్
- వెస్ట్ మిడ్ల్యాండ్స్ ఇండియా ప్రతినిధులతో భేటీ
- తెలంగాణలో పెట్టుబడులకు గల సానుకూలతల వివరణ
ఈ భేటీలో భాగంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ సంస్థకైనా గమ్యస్థానం తెలంగాణేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రోత్సాహకాలతో పాటు ఏ రంగానికి చెందిన పరిశ్రమకైనా తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఐటీ రంగంలో మానవ వనరులకు హైదరాబాద్ అడ్డాగా ఉందని, ఈ క్రమంలోనే హైదరాబాద్కు పలు ఐటీ దిగ్గజాలు వస్తున్నాయని కూడా ఆయన తెలిపారు.