200 కోట్ల గ్రాస్ దిశగా 'సర్కారువారి పాట'
- ఈ నెల 12న విడుదలైన 'సర్కారువారి పాట'
- నిన్నటితో వారం రోజులను పూర్తిచేసుకున్న సినిమా
- తొలివారం వసూళ్లు 171 కోట్ల గ్రాస్
- 200 కోట్ల గ్రాస్ మార్క్ పైనే అందరి దృష్టి
ఈ సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేస్తుందేమో చూడాలి. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాలో మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ లను కొత్తగా చూపించాడు. ఈ ఇద్దరి పాత్రలను తీర్చిదిద్దిన తీరు కూడా కొత్తగా అనిపించింది.
ఇక పాటలు .. ఫైట్లు .. కామెడీ ఈ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చాయి. ఈ సినిమాలో లవ్ ట్రాక్ తనకి బాగా నచ్చిందనీ, ఈ క్రెడిట్ అంతా కూడా పరశురామ్ కి దక్కుతుందని మహేశ్ బాబు అనడం విశేషం.
.