4 రాజ్యసభ సీట్ల కోసం.. వైసీపీ పరిశీలనలో ఐదుగురు అభ్యర్థులు
- జూన్ 21తో ముగియనున్న నలుగురి పదవీ కాలం
- ఆలోగానే నాలుగు సీట్ల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్
- వైసీపీ జాబితాలోకి కొత్తగా వచ్చిచేరిన కిల్లి కృపారాణి
- తుది జాబితా కసరత్తులో సీఎం జగన్
విజయసాయిరెడ్డితో పాటుగా ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న బీజేపీ నేతలు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సురేశ్ ప్రభుల సభ్యత్వం జూన్ 21తో ముగియనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వీరు రిటైర్ అయ్యేలోగా వాటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.