Jagan: నేడు భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న జగన్!

Jagan to perform land breaking ceremony for power project in Kurnool district
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఇంటెగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
  • 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ప్రాజెక్టు
  • ప్రాజెక్టు కోసం 4,766 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తాండా వద్ద ఇంటెగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన కర్నూలుకు బయల్దేరుతారు. అక్కడి నుంచి నేరుగా ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 

ఈ ప్రాజెక్టును గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజ్) ను ఉత్పత్తి చేయనుండటం ఈ ప్రాజెక్టు విశేషం. ఒకే యూనిట్ నుంచి మూడు విభాగాల ద్వారా ఇన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. 

ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్, 550 మెగావాట్ల విండ్, 1,680 మెగావాట్ల హైడల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయబోతున్నారు. ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాల భూమిని కంపెనీకి అప్పగించారు.

  • Loading...

More Telugu News