కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఆర్కే రోజా... ఎదురుగా మాజీ మంత్రులు కొడాలి, పేర్ని
- ఇటీవలే మంత్రి పదవులు కోల్పోయిన కొడాలి, పేర్ని
- మంత్రి పదవితో పాటు కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఆర్కే రోజా
- మచిలీపట్నం భేటీలో ఆకట్టుకున్న వీరి ఫొటో
తాజాగా కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాతో రోజా మచిలీపట్నం రాగా... ఆమె ఎదురుగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూర్చున్నారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కొత్తగా మంత్రి పదవి చేపట్టిన జోగి రమేశ్ కూడా పాలుపంచుకున్నా... ఆయన రోజాకు ఓ వైపున ఆమెకు కాస్తంత వెనుకాల కూర్చున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కొత్త ఇంచార్జీ మంత్రి రోజా ఎదుట ఇద్దరు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూర్చున్న దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.