Mahesh Babu: 'మ మ మహేశా' సాంగ్ కి రెస్పాన్స్ మామూలుగా లేదు!

  •    రిలీజ్ కి రెడీ అవుతున్న 'సర్కారువారి పాట'
  •    తమన్ స్వరపరిచిన పాటలకు మంచి మార్కులు 
  •    'మ మ మహేశా'కి 20 మిలియన్  ప్లస్ వ్యూస్ 
  •    ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల  
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాదు, ఆయన పాత్రకి రొమాంటిక్ టచ్ ఎక్కువగా ఉండనుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి. 

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన టైటిల్ సాంగ్ .. 'కళావతి' సాంగ్ .. ' పెన్నీ' సాంగ్ ఒక  రేంజ్ లో జనంలోకి వెళ్లాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'మ మ మహేశా' సాంగును రిలీజ్ చేయగా ఒక కొత్త రికార్డులను నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. 

 రెండు రోజుల్లోనే ఈ పాట 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. ఈ పాటకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, పాటల పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకున్నట్టే అనుకోవాలి.

More Telugu News