యూపీలో వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం
- ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘటన
- మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ఈ దారుణ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మధురలోని నౌజీల్లో 68వ మైలురాయి వద్ద ప్రమాదం సంభవించింది. బాధితులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు.