JP Nadda: హైదరాబాద్ చేరుకున్న జేపీ న‌డ్డా... కాసేపట్లో 'జ‌నం ఘోష.. బీజేపీ భ‌రోసా' స‌భ‌కు ప‌య‌నం

  • నేటితో ముగియ‌నున్న బండి సంజ‌య్ పాద‌యాత్ర‌
  • మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌
  • ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకే తెలంగాణ‌కు జేపీ న‌డ్డా
jp nadda reaches hyderabad

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా కాసేప‌టి క్రితం హైద‌రాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకున్న న‌డ్డాకు తెలంగాణ బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌, ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌, పార్టీ ముఖ్య నేత‌లు ల‌క్ష్మ‌ణ్, వివేక్ వెంక‌ట‌స్వామి, త‌రుణ్ చుగ్‌, మురళీధర్ రావు, ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి తదిత‌రులు న‌డ్డాకు స్వాగ‌తం ప‌లికారు.

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కొన‌సాగిస్తున్న ప్ర‌జా సంగ్రామ యాత్ర గురువారం నాడు ముగియ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర ముగింపు సంద‌ర్భంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 'జ‌నం ఘోష‌...బీజేపీ భ‌రోసా' పేరిట భారీ బ‌హిరంగ స‌భ‌ను బీజేపీ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకే జేపీ న‌డ్డా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. మ‌రికాసేప‌ట్లో ఆయ‌న శంషాబాద్ నుంచి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు బ‌య‌లుదేర‌నున్నారు.

  • Loading...

More Telugu News