Rahul Gandhi: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఎన్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు

High Court advocate complains against Rahul Gandhi and Revanth Reddy in NHRC
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు దాఖలైంది. వారిద్దరిపై హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తాజా పరిణామాలు ఓయూలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ న్యాయవాది రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదును స్వీకరించిన ఎన్ హెచ్ఆర్సీ దర్యాప్తు చేయనుంది. 

ఈ నెల 6న రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారు. ఈ నెల 7న ఆయన ఓయూ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా, వర్సిటీ పాలక మండలి నుంచి అనుమతి లభించలేదు. దాంతో కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. నిరసనలు తెలిపిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, విద్యార్థి సంఘం నేతలను జైలుకు వెళ్లి పలకరించాలని రాహుల్ భావిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ఇప్పటికే జైలు అధికారులకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Revanth Reddy
NHRC
High Court Advocate
Congress
Telangana

More Telugu News