Husband: ఏ భార్య కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలనుకోదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Allahabad High Court Interesting Comments On Repeated Weddings
  • భర్త తనవాడేనన్నది మహిళ భావనన్న కోర్టు 
  • రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడం నేరమేనని వ్యాఖ్య 
  • మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఒక్క కారణం చాలన్న న్యాయస్థానం  
  • అభియోగాలు కొట్టేయాలన్న వ్యక్తిపై ఆగ్రహం
మన దేశంలో ఏ మహిళ కూడా తన భర్తను పరాయి మహిళతో పంచుకోవాలనుకోదని, వారు తన భర్త తనవాడేనన్న భావనతో ఉంటారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వేరే మహిళతో తన భర్త సంబంధం కలిగి ఉంటానంటే ఏ భార్య కూడా భరించలేదన్నారు. భార్య ఆత్మహత్యకు పురిగొల్పాడంటూ కింది కోర్టు నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ రాహుల్ చతుర్వేది నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిందితుడు సుశీల్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, దీంతో అతడి భార్య ఆత్మహత్య చేసుకుందని వ్యాఖ్యానించింది. ఓ భార్య తన ప్రాణాలు తీసుకోవడానికి.. భర్త రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడమన్న ఒక్క కారణం చాలని జస్టిస్ రాహుల్ చతుర్వేది అన్నారు. మరో మహిళతో తన భర్త కాపురాన్ని పంచుకోవాలనుకోవడం... ఓ భార్యకు శరాఘాతమేనని అన్నారు. కాగా, చనిపోవడానికి ముందు తన భర్త, అతడి ఆరుగురు కుటుంబ సభ్యులపై వారణాసి పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 

తన భర్త తనకు తెలియకుండానే మూడో పెళ్లి చేసుకున్నాడని, అతడితో పాటు తన మెట్టినింటివారు మనోవేదనకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఆమె కేసు పెట్టింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోంది. తనపై పెట్టిన అభియోగాలను కొట్టేయాలని భర్త ట్రయల్ కోర్టుకు విన్నవించగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది.
Husband
Wife
Suicide
Allahabad High Court
High Court

More Telugu News