"సీఎం జగన్ వస్తున్నాడు మీ కార్లు జాగ్రత్త" అంటూ తిరుపతిలో జనసేన వినూత్న ప్రచారం... వీడియో ఇదిగో!
- ఇటీవల ఒంగోలులో ఘటన
- సీఎం కాన్వాయ్ కి కారు కావాలంటూ దాష్టీకం
- తిరుమల వెళుతున్న భక్తుల కారు తీసేసుకున్న వైనం
- భగ్గుమన్న విపక్షాలు
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు.
సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.