షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో గోపీచంద్
- మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న గోపీచంద్ చిత్రం
- ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడ్డ గోపీచంద్
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న డైరెక్టర్ శ్రీవాస్
ప్రస్తుతం గోపీచంద్ 30వ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ లో పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.