Mahesh Babu: 'సర్కారువారి పాట' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • పాటలతో ఆకట్టుకుంటోన్న 'సర్కారువారి పాట'
  • మే 2వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన
  • తొలిసారిగా మహేశ్ తో జతకట్టిన కీర్తి సురేశ్ 
  • మే 12వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారు 
Sarkaru Vaari Paata trailer release date confirmed

మహేశ్ బాబు తాజా చిత్రంగా 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్  .. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మే 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. మే 2వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మహేశ్ జోడీగా ఆమెకి ఇదే మొదటి సినిమా.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన 'కళావతి' .. 'పెన్నీ' పాటల తో పాటు, టైటిల్ సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

More Telugu News