Mahesh Babu: 150 మిలియన్ వ్యూస్ తో 'కళావతి' సాంగ్!

  • వినోదమే ప్రధానంగా 'సర్కారివారి పాట'
  • బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే కథ 
  • మహేశ్ సరసన కీర్తి  సురేశ్ 
  • మే 12వ తేదీన విడుదల  
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ - 14 రీల్స్  సంస్థ  నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఫస్టు సింగిల్ గా వచ్చిన 'కళావతి' పాట కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. 

అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తాజాగా ఆ పాట 150 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకుని అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించిన ఈ పాట ఇంకా అదే స్పీడ్ తో దూసుకునిపోతోంది. 

మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా అలరించింది. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకి భారీ యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండనుంది. సముద్రఖని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News