ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎంత కాలం కొనసాగిస్తారు?: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనను పరిశీలించాలన్న ధర్మాసనం
- కేంద్ర ప్రభుత్వాన్ని తగిన నిర్దేశాలు కోరామన్న ప్రభుత్వం తరపు లాయర్
- రేపటి లోగా పూర్తి వివరాలతో రావాలని సుప్రీం ఆదేశం
దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తగిన నిర్దేశాలు కోరామని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా? అని అసహనం వ్యక్తం చేసింది. రేపటి లోగా పూర్తి వివరాలతో రావాలని... ఆ తర్వాత విచారణను వాయిదా వేయడం ఇక కుదరదని స్పష్టం చేసింది.