తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కొండపల్లి దుర్గాదేవి కన్నుమూత
- తండ్రి, భర్త ప్రభావంతో వామపక్ష ఉద్యమాలవైపు ఆకర్షితురాలైన దుర్గాదేవి
- 1974లో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక
- నేటి మధ్యాహ్నం ఖమ్మంలో అంత్యక్రియలు
1974లో జరిగిన తొలి మహాసభలో దుర్గాదేవి ఐద్వా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె భర్త నరసింహారావు ఇల్లందు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దుర్గాదేవి భౌతిక కాయాన్ని ఈ ఉదయం 9-10 గంటల వరకు హైదరాబాదు, బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఖమ్మంలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. దుర్గాదేవి మృతికి ఐద్వా జాతీయ నేత బృందా కారత్ సహా పలువురు సంతాపం తెలిపారు.