హర్యానా సీఎంతో భేటీ కావడానికి వైజాగ్ వెళ్తున్న జగన్!
- నేచురోపతి ట్రీట్మెంట్ కోసం విశాఖకు వచ్చిన ఖట్టర్
- పెమా వెల్ నెస్ సెంటర్ లో జరగనున్న భేటీ
- విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలతో సమావేశం కానున్న సీఎం
నేచురోపతి ట్రీట్మెంట్ కోసం ఖట్టర్ విశాఖకు వచ్చారు. ఇద్దరు సీఎంల భేటీ సాధారణమైనదే అని చెపుతున్నారు. అయితే, ఖట్టర్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో... ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీ వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే యాంగిల్ లో రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.