నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో చేసింది: ఏపీ మంత్రి కాకాణి
- మంత్రి అనేది పదవి కాదు.. బాధ్యతన్న కాకాణి
- ఎంతో మంది ఆశీర్వాదాలతో ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానన్న మంత్రి
ఎంతో మంది ఆశీర్వాదాలతోనే మంత్రి స్థాయికి వచ్చానని... ప్రతి ఒక్కరి సహకారాన్ని గుర్తుంచుకుంటానని కాకాణి అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో సహకరించిందని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో రుణపడి ఉంటానని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం జగన్ రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయం చేసి, రైతులకు మేలు కలిగేలా చేస్తామని అన్నారు. రైతులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.