రజనీకి విపరీతంగా నచ్చేసిన 'కేజీఎఫ్ 2'
- ఈ నెల 14న విడుదలైన 'కేజీఎఫ్ 2'
- ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు
- సినిమా చూసిన రజనీకాంత్
- నిర్మాతపై ప్రశంసలు
సాధారణంగా రజనీ తనకి ఒక సినిమా నచ్చినా .. ఆర్టిస్టుల .. సాంకేతిక నిపుణుల టాలెంట్ నచ్చినా నేరుగా వారికే కాల్ చేసి అభినందిస్తుంటారు. అలా తాజాగా ఆయన 'కేజీఎఫ్ 2' నిర్మాతకు కాల్ చేసి ప్రశంసించారట. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు.
సినిమా చూసిన వెంటనే రజనీ .. ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ కి కాల్ చేసి ప్రశంసించారట. ఈ సినిమా టీమ్ కి అభినందనలు అందజేశారనీ, సినిమా తనకి చాలా బాగా నచ్చిందని చెప్పారనేది కోలీవుడ్ టాక్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రీనిధి శెట్టి అలరించింది.