Nagababu: మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం: నాగబాబు

  • ప్రభుత్వ వ్యవహారాలపై ప్రజలు ఆసక్తి చూపించాలన్న నాగబాబు
  • ఎవరిని ఉద్దేశించి అన్నారో లేని క్లారిటీ
  • వైసీపీ గురించే అంటున్న నెటిజెన్లు
You are doomed to live under the rule of fools says Nagababu

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తన మనసులోని మాటను నిస్సంకోచంగా వెల్లడిస్తారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'మీరు మీ ప్రభుత్వ వ్యవహారాలపై ఆసక్తి చూపకపోతే... మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం' అని ట్వీట్ చేశారు. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే విషయంలో క్లారిటీ లేదు. అయితే, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News