Passenger: విమానంలో కలకలం.. ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి మంటలు

Passengers phone catches fire midair on IndiGos Assam Delhi flight
  • దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానం
  • ప్రయాణికుడి ఫోన్ నుంచి మంటలు, పొగ
  • వేగంగా స్పందించి ఆర్పివేసిన క్యాబిన్ క్రూ 
  • ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి మంటలు లేచాయి. ఇది చూసి తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. వెంటనే స్పందించిన క్యాబిన్ సిబ్బంది అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ వర్గాలు తెలిపాయి. 

ఈ ప్రమాదం కారణంగా ఎవరికీ గాయాలు కాలేదు. విమాన సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇండిగో సంస్థకు చెందిన 6ఈ 2037 విమానం అసోంలోని దిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికుడి ఫోన్ నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన విమాన సిబ్బందిలో ఒకరు వేగంగా స్పందించి అగ్నిమాపక యంత్రం సాయంతో ఆర్పివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సదరు విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. 



Passenger
phone
Fire Accident
indigo flight

More Telugu News