తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై కేంద్రానికి గవర్నర్ నివేదిక?
- ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్
- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ
- ఈ భేటీలోనే డ్రగ్స్ దందాపై నివేదిక అందజేత
ఇలాంటి కీలక తరుణంలో తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. బుధవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలోనే తెలంగాణలో డ్రగ్స్ దందాకు సంబంధించిన నివేదికను అమిత్షాకు గవర్నర్ అందజేసినట్టు సమాచారం.