పింఛను డబ్బు తీసుకుని ప్రియురాలితో కలిసి పరారైన గ్రామ వాలంటీర్!
- పల్నాడు జిల్లా మూగచింతపాలెంలో ఘటన
- ఇప్పటికే పెళ్లై పిల్లలున్న వాలంటీర్
- పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయి తరుపు బంధువులు
దీంతో, పింఛనుదారులు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో వాలంటీర్ తండ్రి తన కుమారుడు తీసుకెళ్లిన మొత్తాన్ని సచివాలయ సిబ్బందికి అందించారు. అనంతరం వారు లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గ్రామ వాలంటీర్ కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఆయన ఇలా చేయడంతో, అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ రవిపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. పింఛన్ డబ్బులు సరిగా పంపిణీ చేయలేదని స్థానికులు చెపుతున్నారు.