Janasena: మంగ‌ళ‌గిరికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కాసేప‌ట్లో కౌలు రైతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం

  • ఉగాది నాడు కౌలు రైతుల‌కు సాయం ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌
  • పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో పాల్గొన‌నున్న ‌జనసేనాని 
  • కౌలు రైతుల‌కు సాయాన్ని ప్రారంభించ‌నున్న వైనం
pawan kalyan reached mangalagiri

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మంగ‌ళ‌వారం మంగళ‌గిరికి చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంతో పాటు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు రూ.1 ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టేందుకే ప‌వ‌న్ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. కాసేప‌టి క్రితం గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయ‌న అక్క‌డి నుంచి నేరుగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి వెళ్లారు. 

ఈ సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశంలో ప‌వ‌న్ కీల‌క ప్ర‌సంగం చేయ‌నున్నారు. అంతేకాకుండా ఆ కార్య‌క్ర‌మంలోనే కౌలు రైతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం పంపిణీని కూడా ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కౌలు రైతుల కష్టాల‌పై స్పందించిన ప‌వ‌న్‌.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ‌తో పాటు పార్టీ త‌ర‌ఫున రూ.1 ల‌క్ష సాయాన్ని అందించ‌నున్న‌ట్లుగా ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News