Peedika Rajanna Dora: సీఎం జగన్ సమావేశం నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే రాజన్న దొర

  • ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం
  • వర్చువల్ సమావేశం నిర్వహించిన సీఎం జగన్
  • పార్వతీపురం నుంచి హాజరైన పీడిక రాజన్నదొర
  • అస్వస్థతకు గురై పార్వతీపురం ఆసుపత్రిలో చేరిక
YCP MLA Peedika Rajanna Dora hospitalized with mild illness

ఏపీ సీఎం జగన్ ఇవాళ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ ప్రజాప్రతినిధులు వర్చువల్ విధానంలో హాజరు కాగా, మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర పార్వతీపురం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అయితే సమావేశం జరుగుతుండగా రాజన్నదొర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ మధ్యలోనే నిష్క్రమించారు. ఆయనను పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు.

More Telugu News