పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖానే.. అవిశ్వాసం నిలిపివేత
- తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్
- విదేశీ కుట్ర ఉందంటూ ఆరోపణ
- ఓటింగ్ కు తిరస్కరణ
- నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన
దీంతో అవిశ్వాస తీర్మానం జరిగే వరకు ఇమ్రాన్ ఖానే మళ్లీ ప్రధానిగా కొనసాగనున్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్ తీరుపట్ల ప్రతిపక్షాలు సభలోనే ఆందోళనకు దిగాయి. అవిశ్వాసానికి పట్టుబడుతున్నారు. వాస్తవానికి స్పీకర్ అసద్ ఖైజర్ పైనా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడంతో డిప్యూటీ స్పీకర్, స్పీకర్ చైర్ లో కూర్చున్నారు. కాగా, అంతకుముందే ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీతో సమావేశమయ్యారు.