Ugadi: ప్రభుత్వానికి అన్నీ శుభాలే జరుగుతాయి.. ప్ర‌భుత్వ ఆస్థాన సిద్ధాంతి క‌ప్ప‌గంతు జోస్యం

kappagantu panchanga shravan in tadepalli
  • తాడేప‌ల్లిలో క‌ప్ప‌గంతు పంచాంగ శ్ర‌వ‌ణం
  • మంచి ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌వుతోందని వ్యాఖ్య‌
  •  మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందన్న సిద్ధాంతి 

ఏపీ ప్ర‌భుత్వ ఆస్థాన సిద్ధాంతి క‌ప్ప‌గంతు సుబ్బ‌రామ సోమ‌యాజి శ‌నివారం నాడు ఉగాది వేడుక‌ల్లో భాగంగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో పంచాంగ శ్ర‌వ‌ణం వినిపించారు. ఏపీలో మ‌రోమారు వైసీపీనే అధికారం వ‌రిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని ఆయన చెప్పారు.

శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి అన్నీ మంచి శుభాలే జరుగుతాయని కప్పగంతు తెలిపారు. చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలు హాయిగా ఉంటారని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల వల్ల ధరలు పెరిగినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలతో ప్రజలపై భారం పడకుండా చూస్తోంద‌ని సోమయాజి తెలిపారు. అంతేకాకుండా ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని సిద్ధాంతి కప్పగంతు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News