Raj Bhavan: హైదరాబాద్ రాజ్ భ‌వ‌న్‌లో ఉగాది వేడుక‌లు.. గైర్హాజ‌రైన సీఎం, మంత్రులు

  • గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై నేతృత్వంలో ఉగాది వేడుక‌లు
  • మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు హాజ‌రు
  • హాజరైన ర‌ఘునంద‌న్ రావు, చాడా వెంక‌ట‌రెడ్డిలు
cm kcr skips ugadi celebrations in raja bhavan

తెలుగు సంవ‌త్స‌రాది ఉగాదిని పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని రాజ్ భ‌వ‌న్‌లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ఉగాది వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు, సీపీఐ నేత చాడా వెంక‌ట్ రెడ్డిలు హాజ‌ర‌య్యారు.

అయితే అనూహ్యంగా ఈ వేడుక‌ల‌కు సీఎం కేసీఆర్ గానీ, ఆయ‌న కేబినెట్‌లోని మంత్రుల్లో ఒక్క‌రంటే ఒక్కరూ హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏ కార‌ణం చేత వీరు రాజ్ భ‌వ‌న్ ఉగాది వేడుక‌ల‌కు హాజ‌రు కాలేద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు.

More Telugu News