సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు: బొండా ఉమ
- పేదలపై మోయలేని అప్పుల భారాన్ని మోపుతున్నారు
- జగన్ అసమర్థత వల్ల విద్యుత్ వ్యవస్థ గాడి తప్పింది
- ట్రూఅప్ పేరుతో బాదుడుకి జగన్ సిద్ధమయ్యారు
జగన్ ది ముమ్మాటికీ తుగ్లక్ పాలనే అని అన్నారు. సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేందుకే విద్యుత్ చార్జీలను పెంచుతున్నారని దుయ్యబట్టారు. జగన్ అవినీతి, అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. ట్రూఅప్ పేరుతో బాదుడుకు జగన్ సిద్ధమయ్యారని చెప్పారు. గనులు, ఇసుక, మద్యం తదితరాలపై వచ్చే కమీషన్లపై పెట్టిన దృష్టిని పేదలపై పెట్టలేదని విమర్శించారు.