Tipu Sultan: రూ. 6.27 కోట్లకు అమ్ముడుపోయిన టిప్పు సుల్తాన్ ‘విజయ’చిత్రం

  • 1780లో ఆంగ్లో-మైసూర్ యుద్ధం
  • ఈస్టిండియా కంపెనీపై విజయం
  • ఆ విజయానికి గుర్తుగా పెయింటింగ్ గీయించిన ‘టిప్పు’
Painting of historic Tipu Sultan victory over British sold for over Rs 6 crore

1780లో ఈస్టిండియా కంపెనీపై హైదర్ అలీ, అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ సాధించిన విజయానికి గుర్తుగా అప్పట్లో వేసిన చిత్రాలకు తాజాగా మంచి ధర పలికింది. 242 సంవత్సరాల క్రితం సెప్టెంబరు 10న ఆంగ్లో-మైసూరు యుద్ధం జరిగింది. దీనినే ‘ది బ్యాటిల్ ఆఫ్ పొల్లిలూర్’గా పిలుస్తారు. ఈ యుద్ధంలో సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోయేలా టిప్పు సుల్తాన్ స్వయంగా  పెయింటింగ్ గీయించారు.

32 అడుగుల పొడవున్న ఈ పెయింటింగ్‌ను లండన్‌లోని సదబీస్ ఆక్షన్ హౌస్‌‌లో వేలానికి ఉంచారు. వరల్డ్ అండ్ ఇండియా విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రాలు ఏకంగా రూ. 6.27 కోట్లకు (6.30 లక్షల పౌండ్లు) అమ్ముడుపోయాయి.

More Telugu News