Narendra Modi: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 3 శాతం డీఏ పెంపు

  • ఉద్యోగుల‌కు డీఏ పెంచుతూ నిర్ణ‌యం
  • పెన్ష‌న‌ర్ల‌కు డీఆర్ కూడా పెంపు
  • విద్యుత్ పంపిణీలో స‌మూల ప్ర‌క్షాళ‌న‌కు నిర్ణ‌యం
central government hikes 3 persent da to employees

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు బుధ‌వారం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు,పెన్ష‌న‌ర్ల‌కు (డీఆర్) 3 శాతం మేర డీఏ పెంచుతున్న‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా డీఏ బ‌కాయిల‌ను కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌భుత్వం తెలిపింది. 

ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ముగిసిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో మోదీ స‌ర్కారు ఈ నిర్ణ‌యాలు తీసుకుంది. ఇక ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గానూ కేంద్రం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Telugu News