Mahesh Babu: ఉగాదికి 'సర్కారువారి పాట' మూడో సింగిల్!

  • ప్యాచ్ వర్క్ లో 'సర్కారువారి పాట'
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • థర్డ్ సింగిల్ రిలీజ్ కి సన్నాహాలు 
  • మే 12వ తేదీన సినిమా విడుదల   
Sarkaru Vaari Paata movie update

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. ప్యాచ్ వర్క్ మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా వదిలిన 'కళావతి' పాట రికార్డు స్థాయి వ్యూస్ ను రాబడుతూ వెళుతోంది. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ గా 'పెన్నీ' సాంగ్ వదిలారు. మహేశ్ కూతురు సితార కూడా మెరిసిన ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూకుడు చూపుతూ వెళుతోంది. ఇక ఇప్పుడు 'ఉగాది' కానుకగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రానుందనేది ఆసక్తికరంగా మారింది. 

'ఉగాది' రోజున ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ను వదలనున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. మరి మూడో సాంగ్ రిలీజ్ చేస్తారా? ట్రైలర్ వదులుతారా? అనేది చూడాలి. మే 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా సందడి చేయనుండగా, సముద్రఖని .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News