Temperatures: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు... కర్నూలులో అత్యధికంగా 43.5 డిగ్రీల నమోదు

  • పగటి ఉష్ణోగ్రతల్లో భారీగా పెరుగుదల
  • సాధారణం కంటే 4 డిగ్రీలు అదనమన్న వాతావరణ శాఖ
  • పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
Temperatures rises in AP

ఏపీలో వేసవి తీవ్రత హెచ్చుతోంది. పగటి ఉష్ణోగత్రల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరులో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికమని వాతావరణ విభాగం పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 43.5 డిగ్రీల వేడిమి నమోదైంది.

ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు...

అనంతపురం- 41.6 డిగ్రీలు
చిత్తూరు- 41.55
జమ్మలమడుగు- 41.4
కనిగిరి- 41.2
తిరుపతి- 40.2
నెల్లూరు- 39.7
విజయవాడ- 39.2
గుంటూరు- 37.4
విజయనగరం-36.9
ఒంగోలు- 36.8
ఏలూరు- 36.5
కాకినాడ- 34
విశాఖపట్నం- 33.9



More Telugu News