Rajanikanth: రజనీ 169వ సినిమాకి రంగం సిద్ధం .. సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే!

  • రజనీ ఫ్యాన్స్ ను నిరాశపరిచిన 'అన్నాత్తే'
  • 169వ సినిమాకి సన్నాహాలు 
  • మే నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • కథానాయికగా ఐశ్వర్య రాయ్ 
  • దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్
Rajani 169 movie update

రజనీకాంత్ నుంచి ఇటీవల వచ్చిన 'అన్నాత్తే' తమిళనాట పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగులో 'పెద్దన్న' టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కెరియర్ పరంగా రజనీకాంత్ కి ఇది 169వ సినిమా. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా 'బీస్ట్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఏప్రిల్ 13 వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ హడావిడి తగ్గిన తరువాత .. మే నెలలో రజనీకాంత్ తో ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్యరాయ్ పేరు వినిపిస్తోంది. మరో కథానాయికగా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారని అంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించే ఈ  సినిమా నుంచి త్వరలోనే టైటిల్  ను వదులుతారని సమాచారం.

More Telugu News