TTD: దివ్యాంగులు, వృద్ధులకు టీటీడీ శుభవార్త

  • తగ్గిన కరోనా వ్యాప్తి
  • తిరుమల కొండపై సాధారణ పరిస్థితులు
  • దర్శనాల పునరుద్ధరణ
  • ఏప్రిల్ 1 నుంచి వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు
TTD renews special darshans for senior citizens and physically disabled

కరోనా వ్యాప్తి సద్దుమణగడంతో టీటీడీ వివిధ రకాల దర్శనాలు క్రమంగా పునరుద్ధరిస్తోంది. ఇటీవలే ఆఫ్ లైన్ సర్వదర్శన టికెట్ల మంజూరు షురూ చేసిన టీటీడీ... తాజాగా దివ్యాంగులు, వృద్ధులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్ధరిస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. రోజుకు 1000 మంది చొప్పున ప్రత్యేక దర్శనం కల్పించనుంది. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు.

More Telugu News