TDP: డీజీపీకి వ‌ర్ల రామ‌య్య లేఖ‌.. కొడాలి నానిపై విచార‌ణ‌కు డిమాండ్‌

  • గుడివాడ‌లో ప్ర‌త్యేక రాజ్యాంగం అమ‌లు
  • కొడాలి నాని గుప్పిట్లో గుడివాడ‌
  • క్యాసినోపై తీసుకున్న చ‌ర్య‌లేమిటన్న రామయ్య 
  • ద‌ర్యాప్తు నివేదిక‌ను బ‌హిర్గతం చేయాలలంటూ డిమాండ్  
varlaramaiah letter to ap dgp

టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య సోమ‌వారం నాడు ఏపీ డీజీపీకి ఓ లేఖ రాశారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (నాని) అక్ర‌మాస్తులు, దౌర్జ‌న్యాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆ లేఖలో డిమాండ్ చేశారు. గుడివాడ‌లో కొడాలి నాని ప్ర‌త్యేక రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని కూడా రామ‌య్య ఆరోపించారు.

గుడివాడ‌ను గుప్పిట్లో పెట్టుకున్న కొడాలి నాని.. ప‌ట్ట‌ణంలో ప్ర‌త్యేక రాజ్యాంగం, ప్రత్యేక చ‌ట్టం అమ‌లు చేస్తున్నార‌ని రామ‌య్య విమర్శించారు. అక్రమ క్యాసినో నిర్వ‌హ‌ణ‌పై తీసుకున్న చ‌ర్య‌లతో పాటు.. ఈ వ్య‌వ‌హారంపై నూజివీడు డీఎస్పీ చేప‌ట్టిన ద‌ర్యాప్తు నివేదిక‌ను బ‌హిర్గతం చేయాల‌ని వ‌ర్ల ఆ లేఖలో డిమాండ్ చేశారు.

More Telugu News