Nithin: సురేందర్ రెడ్డిని లైన్లో పెట్టిన నితిన్!

  • నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజకవర్గం'
  • ఆ తరువాత సినిమా వక్కంతం వంశీతో 
  • కథానాయికగా శ్రీలీల ఎంపిక 
  • సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ 
Nithin in Surendar Reddy Movie

మొదటి నుంచి కూడా నితిన్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. హిట్ .. ఫ్లాప్ అనే విషయాలను అంతగా పట్టించుకోకుండా ఆ వెంటనే తదుపరి ప్రాజెక్టులను లైన్లో పెట్టడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మాచర్ల నియోజకవర్గం' రెడీ అవుతోంది.

ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను సెట్ చేశారనీ, నితిన్ జోడీగా శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రాజెక్టును కూడా నితిన్ సెట్ చేసుకున్నాడనేది తాజా సమాచారం. 

 నితిన్ చేసే ఆ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. సురేందర్ రెడ్డి. ఆయనను నితిన్ లైన్లో పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్ తో 'ఏజెంట్' సినిమా చేస్తున్న ఆయన, ఆ తరువాత పవన్ సినిమా చేయనున్నాడు. అయితే పవన్ తో సినిమాకి ముందే నితిన్ ప్రాజెక్టును ఆయన పట్టాలెక్కిస్తున్నాడని అంటున్నారు.

More Telugu News