Sharmila: స్టూడెంట్ తో కలిసి పారిపోయిన లేడీ లెక్చరర్

  • తమిళనాడులోని తురయ్యూర్ లో ఘటన
  • ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి
  • అదే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న షర్మిల
  • షర్మిల వయసు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య ప్రేమ
Lecturer eloped with student in Tamilnadu

తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునే స్టూడెంట్ తో కలిసి ఓ లేడీ లెక్చరర్ పరారైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తురయ్యూర్ లో 17 ఏళ్ల విద్యార్థి ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో షర్మిల (26) లెక్చరర్ గా పనిచేస్తోంది. కాగా, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఆ విద్యార్థి మార్చి 5 నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. అదే రోజున షర్మిల కూడా అదృశ్యమైంది. వారిద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకునేందుకు వెళ్లిపోయారు. 

ఈ విషయం తెలియని విద్యార్థి తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో... షర్మిల కూడా కనిపించకుండా పోయిన విషయం వెల్లడైంది. దాంతో, ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు ఎక్కడ ఉన్నారో గుర్తించారు. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ లెక్చరర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, వారిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News