Andhra Pradesh: ఏపీలో తాజాగా 30 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 10,529 కరోనా పరీక్షలు
  • జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు
  • 4 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • కరోనా నుంచి కోలుకున్న 51 మంది
  • ఇంకా 485 మందికి చికిత్స
AP Corona daily updates

ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా వ్యాప్తికి సంబంధించి తాజా బులెటిన్ విడుదలైంది. 10,529 కరోనా పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 51 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,297 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,082 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 485 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.

More Telugu News